Facebook Twitter Google RSS

టాటా..బై..బై.. టెస్ట్ క్రికెట్‌కు ధోనీ గుడ్‌బై

Unknown     9:58 PM  No comments



మహేంద్ర సింగ్ ధోనీ టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. ఇది తక్షణం అమల్లోకి వస్తుంది. ఆస్ట్రేలియాతో మూడో టెస్ట్ మ్యాచ్ డ్రా అనంతరం ధోనీ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ధోని 90 టెస్ట్ మ్యాచ్‌లు ఆడగా అందులో 60 టెస్ట్‌లకు నాయకత్వం వహించాడు.

అతని రిటైర్మెంట్ పై స్పందిస్తూ, ధోనీ అత్యుత్తమ భారత టెస్ట్ కెప్టెన్‌లలో ఒకరని, అతని నాయకత్వంలో భారత జట్టు టెస్ట్ ర్యాంకింగ్‌లో అగ్ర స్థానానికి ఎదిగిందని బీసీసీఐ ప్రశంసించింది. దీనితో వన్డే, టీ-20లలో మాత్రమే ధోనీ కొనసాగుతాడు.

మెల్‌బోర్న్ టెస్ట్‌లో ధోనీ పేరిట కొత్త రికార్డు నమోదైంది. ఒకే టెస్ట్ మ్యాచ్‌లో తొమ్మిది మందిని అవుట్ చేయడంలో(8 క్యాచ్‌లు, 1 స్టంపింగ్) పాలు పంచుకున్న మొదటి భారత వికెట్ కీపర్ అయ్యాడు. ఆస్ట్రేలియా మీద ఈ ఫీట్ సాధించిన వారిలో ధోనీ మూడవ ఆటగాడు. 

అదే విధంగా అంతర్జాతీయ క్రికెట్లో పదివేల పరుగులు పూర్తి చేసుకున్న మొదటి భారత కెప్టెన్ అయ్యాడు. పాంటింగ్, గ్రేమ్ స్మిత్, స్టీఫెన్ ఫ్లెమింగ్, అలెన్ బోర్డర్‌లు ఈ జాబితాలో ఉన్నారు. జనవరి 6 నుంచి జరగనున్న చివరి టెస్ట్‌లో భారత జట్టుకు కోహ్లీ నాయకత్వం వహిస్తాడు.

ధోనీ టెస్ట్ క్రికెట్ కెరీర్...
2005లో శ్రీలంకతో తొలి టెస్ట్ ఆడిన ధోనీ కెరీర్‌లో 90 టెస్టులు ఆడి 4876 పరుగులు చేశాడు. 60 టెస్టుల్లో టీమిండియాకు కెప్టెన్‌గా బాధ్యతలు వహించిన ధోనీ భారత్‌కు 27 టెస్ట్ విజయాలను అందించాడు. టెస్టుల్లో మొత్తం 256 క్యాచ్‌లు, 38 స్టంప్ ఔట్‌లు చేశాడు. టెస్టుల్లో ధోనీ వ్యక్తిగత అత్యధిక స్కోర్ 224 పరుగులు. టెస్టుల్లో 6 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు చేశాడు. ధోనీ కెప్టెన్సీలో టెస్టుల్లో వరల్డ్ నెంబర్ 1 గా భారత్ నిలిచింది. టెస్ట్ క్రికెట్‌కు అందించిన అపార సేవలను కొనియాడుతూ బీసీసీఐ ప్రశంసించింది.

ధోనీ..నీ టార్గెట్ 2015 వరల్డ్ కప్
 టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన ధోనీపై ప్రశంసల వర్షం కురిపించాడు సచిన్. ధోనీతో కలిసి ఆడిన క్షణాలను ఎంతో ఆస్వాదించానన్నాడు. ధోనీకి తదుపరి లక్ష్యం 2015 వన్డే ప్రపంచ కప్ కావాలన్నాడు. మీ సారథ్యం దేశానికే గర్వకారణం అని శృతి హాసన్ అంది. సురేశ్ రైనా స్పందిస్తూ మీ నిష్క్రమణ సాహసోపేత నిర్ణయం అని చెప్పాడు. 

గంగూలీ ఈ సిరీస్ మొత్తం ధోనీ ఆడితే బాగుండున్నాడు. రెండేళ్ళ పాటు ఆడే సత్తా ధోనీలో ఉందని గవాస్కర్ చెప్పాడు. దేశం గర్వించదగ్గ విజయాలు ధోనీ అందించాడని ప్రియమణి ప్రశంసించింది. 

టెస్ట్ కెప్టెన్‌గా కొనసాగనున్న కోహ్లీ
హైదరాబాద్: టెస్టులకు ధోనీ కెప్టెన్సీపై కొంతకాలంగా విమర్శలు తలెత్తుతున్న విషయం విధితమే. జట్టు పగ్గాలు కోహ్లీకి ఇవ్వాలని సీనియర్లు సూచిస్తూ వచ్చారు. ఆసీస్‌తో జరిగే చివరి టెస్ట్‌కు కెప్టెన్‌గా కోహ్లీయే వ్యవహరించనున్నాడు.

,

0 comments :

Political News

Sports News

Latest Jobs

Follow for Job Updates

Powered by Hey Telangana

Visitors Count

© 2014 Hey Telangana.
.