Facebook Twitter Google RSS

గోపాల గోపాల పాటలు

Unknown     3:40 PM  No comments

గబ్బర్‌సింగ్ ఇంటర్వెల్ ఫైట్ చిత్రీకరణ జరుగుతోంది. ఆ సమయంలో మహబూబ్‌నగర్ నుంచి వచ్చిన ఓ అభిమాని అందరినీ తోసుకుంటూ వచ్చి ఒక్క హిట్టివ్వన్నా..! రోడ్లమీద తిరగలేకపోతున్నాం. నీకు కథలు కావాలంటే చెప్పు నేనిస్తాఅన్నాడు. ఆ మాటలు విని కదిలిపోయాను అన్నారు పవన్‌కల్యాణ్. ఆయన వెంకటేష్‌తో కలిసి నటిస్తున్న చిత్రం గోపాల గోపాల. హిందీలో విజయవంతమైన ఓ మైగాడ్ చిత్రానికి రీమేక్ ఇది. సురేష్‌ప్రొడక్షన్స్, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డి.సురేష్‌బాబు, శరత్‌మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కిషోర్ పార్థసాని (డాలి) దర్శకుడు. శ్రియ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్ర గీతాలు ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. 

అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియోను పవన్‌కల్యాణ్ ఆవిష్కరించారు. తొలిప్రతిని వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ స్వీకరించారు. ఈ సందర్భంగా పవన్‌కల్యాణ్ మాట్లాడుతూ చిన్నతనం నుంచి నాకు ఏం కావాలనుందో తెలిసేదికాదు. మా అమ్మ అడిగినా,అన్నయ్యలు అడిగినా ఏం చెప్పాలో తెలిసేదికాదు. చివరికి ఈ ప్రపంచంలో ఇమడలేనని భావించి స్నేహితుడు ఆనంద్‌సాయితో కలిసి శ్రీశైలం అడవుల్లోకి పారిపోదామనుకున్నా అదే సమయంలో అన్నయ్య ఫోన్ చేసి హైదరాబాద్ రమ్మన్నారు. ఆ తర్వాత అన్నీమర్చిపోయి కొంతకాలం దీక్ష, ధ్యానంలో వుండిపోయాను. 

రోజూ అన్నయ్య దెబ్బలు తగిలించుకుని ఇంటికి వస్తే ధ్యానం చేస్తే బాగుంటుందని ఆయనతో కథలు చెప్పేవాడిని. అన్నీ సమకూరుతున్నప్పుడు సలహాలు చెప్పడం కాదు. నీ వంతు నువ్వు కష్టపడి తరువాత ఇలాంటివి చెప్పు అప్పుడు నమ్ముతాను అని అన్నయ్య అన్నారు. ఆ మాటలు నాకు చెంపపెట్టులా అనిపించాయి. ఈ మాటల్ని నా తుది శ్వాస ఉన్నంత వరకు గుర్తుంచుకుంటాను. ఖుషి సినిమా తరువాత నాకు విజయాలు లేవు. అయినా అభిమానులు నా వెన్నంటే వున్నారు. ఇప్పటి వరకు నా గురించి భగవంతుడిని ఏమీ కోరుకోలేదు. దేవుడా...ఒక్క హిట్టివ్వు చాలు సినిమాల నుంచి వెళ్లిపోతా అని కోరుకున్నా. నేను ఒక్క హిట్టు కావాలని అడిగితే నాకు భగవంతుడు అంతకు మించి విజయాలు అందించాడు. 

ఎన్ని విజయాలు వచ్చినా భగవంతుడి ముందు మోకరిల్లే వుంటాను అన్నారు. వెంకటేష్ మాట్లాడుతూ కొత్త పంథాలో తీసిన సినిమా ఇది. పవన్ ఈ సినిమా ఒప్పుకోవడం అన్నింటికంటే ఆనందాన్ని కలిగించింది. సినిమాలో పవన్ చెప్పినట్టు లేట్‌గా వచ్చినా లేటెస్ట్‌గా వస్తాం పవన్‌తో చాలా సార్లు సినిమా చేయాలనుకున్నా కానీ కుదరలేదు. లేట్‌గా అయినా ఈ సినిమాతో వస్తున్నాం. ఈ సంక్రాంతికి ఈ సినిమాతో పవర్‌ఫుల్ విక్టరీ ఇస్తారని ఆశిస్తున్నాను అన్నారు. ఈ కార్యక్రమంలో శరత్‌మరార్, డి.సురేష్‌బాబు, అనూప్ రూబెన్స్, దిల్‌రాజు, జెమిని కిరణ్, గౌతంరాజు,భరణి, అనంతశ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. 

, ,

0 comments :

Political News

Sports News

Latest Jobs

Follow for Job Updates

Powered by Hey Telangana

Visitors Count

© 2014 Hey Telangana.
.