Facebook Twitter Google RSS

కేరళ పర్యటనకు వెళ్లిన కేటీఆర్

Unknown     3:59 PM  No comments



 పంచాయతీరాజ్ శాఖ మంత్రి కే తారకరామారావు రెండు రోజుల పర్యటనకు సోమవారం కేరళ బయలుదేరి వెళ్లారు. మంగళవారం (6వ తేదీ) కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ నిర్వహించే జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంపై ప్రాంతీయ సదస్సులో కేటీఆర్ పాల్గొంటారు. 

కేరళ రాజధాని తిరువనంతపురం సమీపంలోని కోవలంలో జరగనున్న ఈ సదస్సులో కేరళ, తమిళనాడు, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరి, గోవా, మహరాష్ట్రతోపాటు అండమాన్, నికోబార్, లక్షద్వీప్‌కు చెందిన ప్రతినిధులు పాల్గొంటారు. జాతీయ ఉపాధిహామీ పథకంపై సమీక్షతోపాటు,ఈ పథకం పటిష్టతకు చేపట్టాల్సిన చర్యలపై చర్చిస్తారు. ఈ సదస్సులో కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి చౌదరి బీరేంద్రనాథ్‌సింగ్, కేరళ సీఎం ఊమెన్‌చాందీ పాల్గొంటారు. వివిధ రాష్ర్టాల్లో ఉపాధిహామీ విజయాలను, పనితీరు నమూనాలపై చర్చిస్తారు. 

ఈ పథకాన్ని కుదించవద్దంటూ తెలంగాణ అసెంబ్లీ తీర్మానం, దీనితో జిల్లాల్లో జరిగిన ప్రగతిని, పలు విజయాలను మంత్రి కేటీఆర్ సదస్సులో ప్రస్తావిస్తారు. సోషల్ అడిట్స్‌పై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చట్టం మీద ఎస్‌ఎస్‌ఏఏటీ డైరెక్టర్ సౌమ్యకిదాంబి ప్రజెంటేషన్ ఇస్తారు. ఈనెల 7న అక్కడి పంచాయతీలను కేటీఆర్ పరిశీలిస్తారు. ఈ సదస్సులో పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ రేమండ్ పీటర్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ వెంకటేశ్వర్లు పాల్గొంటారు. 

, ,

0 comments :

Political News

Sports News

Latest Jobs

Follow for Job Updates

Powered by Hey Telangana

Visitors Count

© 2014 Hey Telangana.
.