అమీర్ఖాన్ కథానాయకుడిగా నటించిన పీకే చిత్రం భారతీయ బాక్సాఫీస్ వద్ద సరికొత్త సంచలనాలకు వేదికగా నిలుస్తోంది. విడుదలైన మూడువారాల్లోనే దేశీయంగా 300వందల కోట్లు, అంతర్జాతీయంగా 600కోట్ల కలెక్షన్ల మైలురాయిని దాటిన చిత్రంగా పీకే భారతీయ సినీ చరిత్రలో కొత్త రికార్డును సృష్టించిందని ముంబై ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
గత కొన్నేళ్లుగా అమీర్ఖాన్ నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డుల్ని నమోదుచేస్తున్నాయి. గజిని చిత్రంతో బాలీవుడ్లో తొలిసారిగా 100కోట్ల మైలురాయిని అందుకున్నారు అమీర్ఖాన్. త్రీ ఇడియట్స్ చిత్రంతో 200కోట్ల మైలురాయిని అధిగమించారు. తాజాగా పీకే చిత్రం ద్వారా 300కోట్ల కలెక్షన్స్ సాధించారు. మతపరమైన విశ్వాసాల్ని ప్రశ్నించేలా పీకే చిత్రంలో కొన్ని అంశాలున్నాయని వివాదాలు చెలరేగుతున్నా.. ఇవేమీ కలెక్షన్స్పై ప్రభావం చూపకపోవడం విశేషమని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
0 comments :
Post a Comment